నిజామాబాద్ బస్ స్టేషన్ లో దొంగలు…. జర జాగ్రత్త


నిజామాబాద్, డిసెంబర్ 23 ( లోకంతీరు ) : నిజామాబాద్ లోని బస్టాండ్ లో రాత్రి 8 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తుండగా అక్కడ పని చేస్తున్న ఆర్. టి. సి రక్షక భటులు అయిన జె. నరేష్ మరియు బి.మహేష్ లు అక్కడ ఉన్న సి. సి ఫూటేజ్ ఆధారంగా దొంగని పట్టుకోవడం జరిగింది. ఒకటవ టౌన్ ఎస్. ఐ తెలిపిన వివరాల ప్రకారం ఒకరు మామిడి పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా అదే సమయంలో బస్టాండ్ లో ప్రయాణికుల పర్సు లను దొంగతనం చేస్తుండగా పట్టుబడిన వ్యక్తి , నాందేడ్ వాసి గా గుర్తించి 1 వ ఠాణాకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.