నగరంలోని అన్ని డివిజన్ ల అభివృద్ధికి కృషి చేస్తా
– నూడా చైర్మన్ కేశ వేణు

నిజామాబాద్ అర్బన్, డిసెంబర్ 29 ( లోకంతీరు ) : నూడా చైర్మన్ కేశ వేణు గారు 7 వ రామ్మూర్తి గోపి మరియు 8వ రమేష్ డివిజన్ లో ఆధ్వరంలో గల ప్రజల ఆహ్వానం మేరకు రోటరీ నగర్ లో సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా రోటరీ నగర్ ప్రజలు పలు సమస్యలను కేశవేణు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది.ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ 7వ మరియు 8వ డివిజన్ లో గల సమస్యలను డివిజన్ లోని ప్రజలతోపాటు కాంగ్రెస్ నాయకులతో చర్చించి వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని, గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల 7వ మరియు 8వ డివిజన్ ల లోనే కాకుండా నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోయిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 7వ మరియు 8వ డివిజన్ తో పాటు అన్ని డివిజన్లలో లోని అన్ని సమస్యలను పరిష్కరించి డివిజన్లను అభివృద్ధి చేస్తామని ఇందుకోసం సమస్యలను పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరియు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి అధిక మొత్తంలో నిధులు తీసుకువచ్చి డివిజన్లలో మౌలిక వసతులైన తాగునీరు, డ్రైనేజీల నిర్మాణం బీటీ రోడ్లు సిసి రోడ్లు విద్యుత్ దీపాలతో పాటు డివిజన్లో అవసరమైన చోట పార్కులను కూడా నిర్మిస్తామని ఆయన అన్నారు. నూడా చైర్మన్ గా తాను కూడా ప్రత్యేక నిధులతో డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇక నుండి ప్రతి నగరంలోని ప్రతి డివిజన్ ను సందర్శించి డివిజన్ లోని ప్రతి సమస్య పరిష్కారానికి నూడా చైర్మన్ గా ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ఆయన ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కార్పొరేటర్ రామర్తి గోపి, ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్, 8 వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రమేష్ తో పాటు 7 వడివిజన్ మరియు 8వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు 50 డివిజన్ అవిన్, కిషోర్, దేవదాస్, కిరణ్, రాజు, కౌశిక్, తదితరులు పాల్గొన్నారు.