బోధన్ పట్టణంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన భాజపా

ఎడపల్లి, సెప్టెంబర్ 17 ( లోకంతీరు ) : భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గ సీనియర్ నాయకులు టి నరసింహ రెడ్డి గారు మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వతంత్రం 1948 సెప్టెంబర్ 17న నాటి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పోలీస్ చర్య వల్ల హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపి కిషన్ మాజీ పట్టణ అధ్యక్షులు కూలిపాక బాలరాజు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్ (చిన్న) పట్టణ ప్రధాన కార్యదర్శిలు అరవింద్ పవన్ కుమార్ సీనియర్ నాయకులు వేణు హనుమండ్లు చారి పట్టణ ఉపాధ్యక్షులు సందీప్ కార్యదర్శులు స్వప్నిల్ గంగుల శ్రీకాంత్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు గౌతమ్ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎశాల సూరి దళిత మోర్చా అధ్యక్షులు కృష్ణ కమల సాయిలు బిల్లా విజయ్ అనిల్ కుమార్ ఈశ్వర్ లింగం విజయ్ పడాల శ్రీను కిరణ్ శ్రీకాంత్ ఉప్పలం సాయిలు తదితరులు భాజపా నాయకులు పాల్గొన్నారు