ఎడపల్లి సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలలో పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే


ఎడపల్లి, అక్టోబర్ 05 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో గల శ్రీ సాయిబాబా ఆలయం 15వ వార్షికోత్స వేడుకలలో బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోనీ భక్తికార్యక్రమాలు నిర్వహించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు అనంతరంసాయిబాబా ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వర శర్మ ప్రత్యేక పూజలు వేద పండితులచేఘనంగా నిర్వహించారు గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఆలయ వార్షికోత్సవాలు ఆదివారంతో ముగిసాయి ఈ మేరకు ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వార్షికోత్సవ వేడుకలో భాగంగా భజన కార్యక్రమాలు చిన్నారుల సంస్కృతిక పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాయిబాబా భక్తులు గ్రామస్తులు యువకులు మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారితీర్థప్రసాదాలు తీసుకున్నారు అనంతరం సాయిబాబా ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వర శర్మ సామాజిక ఆధ్యాత్మిక సేవలను ఆయన కొనియాడారు పలువురు పేదలకు కుట్టు మిషన్లు నిత్యవసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ ఎడపల్లి గ్రామ అధ్యక్షులు బంజ కామప్ప సొసైటీ చైర్మన్ పోలా మల్కా రెడ్డి మాజీసర్పంచ్ శంకర్ నాయుడు మచ్చుకూరి గంగాధర్ తూట్కూర్ రవీందర్ రెడ్డి రత్నాకర్ రెడ్డి బొబ్బిలి శ్రీనివాస్ ఐరన్లనవీన్ మల్లెపూల శేఖర్ నిజామాబాద్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఈ రెంటి లింగం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు డల్ల సురేష్ కంచరి శ్రీనివాస్ రజిత ఎల్లయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు