స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలను మూసివేత
ఎడపల్లి, అక్టోబర్ 18 ( లోకంతీరు ) : తెలంగాణ బిసి జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 42% బీసీలకు రిజర్వేషన్ల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో కిరాణ కోట్లు వ్యాపారుల దుకాణ సముదాయాలను స్వచ్ఛందంగా యజమానులు మూసివేశారు. ఎడపల్లి ,కుర్నపల్లి, జానకంపేట మంగల్ పహాడ్, నెహ్రూ నగర్, ఏఆర్పి క్యాంప్, తనకలాన్, సటాపూర్ గెట్ ఆయా గ్రామాలలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు బిసి కులాలకు చెందిన యువత 42 శాతం రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జానకంపేటలో నాయకులు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అయితనే సముచిత న్యాయం జరుగుతుందన్నారు. ఇదే కాకుండా రేపు భవిష్యత్తులో తమ పిల్లల ఉన్నత చదువులకు కూడా బీసీ రిజర్వేషన్ వర్తిస్తుందని నాయకులు డిమాండ్ చేశారు. గతంలో రెడ్డిల పాలన, రావులపాలన జరిగేది. మరి ప్రస్తుత కాలంలో అధికార పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్ను తీసుకొస్తే సుప్రీంకోర్ తో పాటు హైకోర్టు ఎందుకు ఇస్తే ఇవ్వడం లేదని నాయకులు ప్రశ్నించారు. బిసి 42 శాతం రిజర్వేషన్ అమలయింతవరకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నాయకులు హెచ్చరించారు. ఉప్పు సురేష్ ,తాళ్ల విజయకుమార్ గౌడ్, సుంచనకోట రాధా కిషన్ గౌడ్, మంద సంజీవ్ కుమార్, భాజపా, టిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీల తాజా మాజీ ప్రజాప్రతినిధులు ,నాయకులు యువకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సైతం బిసి 42 శాతం రిజర్వేషన్ పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు.