జైతాపూర్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం
ఎడపల్లి, నవంబర్ 03 ( లోకంతీరు ) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అద్వర్యం లో బోధన్ లయన్స్ కంటి హాస్పిటల్స్ సహకారంతో సోమవారం జైతాపూర్ గ్రామం లో లైన్స్ క్లబ్ డిసి మెర్సీ డయాబెటిక్ శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ పక్షాన ఉచిత మొబైల్ కంటి స్క్రీనింగ్క్యాంప్ ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలోవైద్యులు.అజయ్ సుమారు 60 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా ఇందులో 10 మందికి మోతె బిందు ఉన్నట్లు గుర్తించి వారిని ఉచిత కంటి శస్త్ర చికిత్స నిమిత్తం బోధన్ లయన్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. కార్యక్రమo లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడ్పల్లి అధ్యక్షురాలు పుష్పలత ,సెక్రటరీ మెర్సీ, కోశాధికారి శంకర్, జి ఈ టీ కో-ఆర్డినేటర్ సూర్య నారాయణ ,లయన్ కృష్ణరావు, గంగారెడ్డి,నార్ల కాశీనాథ్ గుప్తా ,,ప్రకాష్ రావు ,మనోజ్ , పి ఆర్ ఓ, రాకేష్ వర్మ, గ్రామపంచాయతీ కార్యదర్శి నగేష్ సిబ్బంది ,తధితరులు పాల్గొనారు.