జానకంపేట్ గ్రామ ప్రజల సహకారంతో ఎన్నికల్లో గెలుస్తా

ఎడపల్లి , డిసెంబర్ 05 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నందున గ్రామస్తులు తనను ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటును పాన గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసారి గ్రామస్తులు అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సర్పంచ్ అభ్యర్థి సుంచన కోట అనురాధ వెంట ప్రచార కార్యక్రమంలో సుంచనకోట రాధా కిషన్ గౌడ్, విజయ్ గౌడ్, జహీర్ ఖాన్, అశ్వక్, తదితరులు ఉన్నారు.