సర్పంచ్ లను సన్మానించిన ఎమ్మెస్సీ ఫారం తాజా మాజీ ఎంపీటీసీ
– సుధా నాగేందర్ రెడ్డి

ఎడపల్లి , డిసెంబర్22 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంఎమ్మెస్సీ ఫారంలో సర్పంచ్ నోముల జయశ్రీ శ్రీనివా స్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉండి శ్రీ సుధానాగేందర్ రెడ్డి ఎమ్మెస్సీ ఫారం, పోచారం, దుబ్బ తండా, బ్రాహ్మణపల్లి గ్రామాలలో సర్పంచులు గా గెలుపొంది సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచులను ఎమ్మెస్సీ ఫారం, తాజా మాజీ ఎంపీటీసీ ఉండి శ్రీ సుధా నాగేందర్ రెడ్డి శాలువాలతో సన్మానించి పూలబుక్కెను అందించారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెస్సీ ఫారం సర్పంచ్ నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్, జైతాపూర్ సర్పంచ్ రాజు గౌడ్, జమలం సర్పంచ్ దొడ్డి శ్రీనివాస్, దుబ్బ తండ సర్పంచ్ మాంగ్య నాయక్, బ్రాహ్మణపల్లి సర్పంచ్ పురమళ్ళ హనుమంతును కలిసి వారికి ఘనంగా సన్మానించారు. గ్రామాల అభివృద్ధి సర్పంచ్ తో పాటు పాలకవర్గంతో సాధ్యమవుతుందని ఆయన అన్నారు.