బాలాజీ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ కు సన్మానం

ఎడపల్లి , డిసెంబర్ 24 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామపంచాయతీ సర్పంచ్ గా నూతనంగా ఎన్నికైన సుంచనకోట అనురాధ రాధకిషన్ గౌడ్ దంపతులను స్థానిక బాలాజీ వికలాంగుల సంఘం అధ్యక్షులు రుక్కుమాయి గంగాధర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఉపసర్పంచ్ శీలం కృష్ణ తోపాటు వార్డు సభ్యులను, గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులను, గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందిని, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సన్మానించిన వారిలో నరసయ్య, దివ్యాంగులు, తదితరులు ఉన్నారు.