లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న జనకంపేట్ సర్పంచ్ దంపతులు

ఎడపల్లి , డిసెంబర్ 24 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జానకంపేట గ్రామపంచాయతీ సర్పంచ్ సుంచనకోట అనురాధ, రాధా కిషన్ గౌడ్ బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందారు. అర్చకులు సర్పంచ్ దంపతులను ఆశీర్వదించారు. వారి వెంట కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.