1 వ టౌన్ లో గంజాయి కేసు నమోదు

నిజామాబాద్ క్రైమ్ , జనవరి 30 ( లోకంతీరు ) : ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర ఫ్రెండ్స్ షాప్ నిజామాబాద్ నందు గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం రాగా, అట్టి సమాచారం మేరకు పోలీస్ వారు అక్కడికి వెళ్లి చూడగా, మైనర్ బాలుడు గంజాయి అమ్ముతుండగా అతన్ని పట్టుకొని, విచారించగా శాంతినగర్ కు చెందిన అబ్దుల్ జియా ద్వారా గంజాయి ని తెప్పించుకొని, ఇతను మరియు ఇతని తండ్రి షేక్ ఏజాజ్ ఇతరులకు అమ్ముతారు అని తెలిపినారు, ఇతని వద్ద నుండి 130 గ్రాముల గంజాయి స్వాధీన పరచుకొని కేసు నమోదు చేయటం జరిగింది.ఎవరైనా గంజాయి అమ్మిన గంజాయి తీసుకున్న చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇండములంగా తెలియచేయటం జరుగుతుంది.ఒకటవ టౌన్ కేసు నమోదు చేసినట్లు బి.రఘుపతి, ఇన్స్పెక్టర్,స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.