డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికి జైలు శిక్ష
ఎడపల్లి, నవంబర్ 16 ( లోకంతీరు ) : నవీపేట్ మండల పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన నలుగురూ వ్యక్తులకు నిజామాబాద్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా ఇద్దరు వ్యక్తులకు వారం రోజులపాటు జైలు శిక్ష విధించగా మరో ఇద్దరికి 10000 వేలు మరొక్కరికి 12000 ల రూపాయలు జరిమానా విధించడం జరిగిందని నవీపేట్ ఎస్ ఐ తిరుపతి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు కూడా మద్యం తాగి వాహనాలు నడపరాదని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పదేపదే సూచించిన వాహనదారులు పెడ చెవినా పెడుతున్నారు అని తెలిపారు వాహనదారులు మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా సక్రమంగా ఇంటికి చేరుకోవాలని అన్నారు.