ఎడపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఎడపల్లి, సెప్టెంబర్29 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తాసిల్దార్ కార్యాలయాన్ని తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారిగా రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్ష జరిపారు వచ్చిన దరఖాస్తులు ఆయా షెడ్యూల్లో ఎన్ని ఆర్జీలు పరిష్కరించారూ ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఎంతమందికి నోటీసులు ఇచ్చారు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిన తదితర వివరాలను తాసిల్దార్ దత్తాద్రి నీఅడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాధ్యమైనంతవరకు దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు కలెక్టర్ వెంట తాసిల్దార్ దత్తాద్రి ఎంపీడీవో శంకర్ రెవెన్యూ సిబ్బంది స్థానిక అధికారులు ఉన్నారు