ఏక్తా దివస్ సందర్భంగా ఎడపల్లిలో టూ కే రన్
ఎడపల్లి, అక్టోబర్ 31( లోకంతీరు ) : భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఎడపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. బోధన్ గ్రామీణ సిఐ విజయ్ బాబు నేతృత్వంలో గ్రామంలో భారీ రాలి నిర్వహించారు. బాలికల గురుకుల పాఠశాల నుండి మంగలపాడు ఎక్స్ రోడ్ వరకు మూడు కిలోమీటర్ల మేర గురుకుల పాఠశాల బాలికలు ఉపాధ్యాయులు. యువకులు. పలు పార్టీల నాయకులు, పోలీసులతో కలిసి బోధన్ ,నిజామాబాద్ ప్రధాన రహదారిపై 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ జాతీయ జెండాను ఊరేగించారు. ఇందులో ఎడపల్లి ఇంచార్జ్ ఎస్సై రాజు, బోధన్ ఎస్ఐ మశ్చీందర్ రెడ్డి, ఇన్చార్జి ప్రిన్సిపల్ రజిని కుమారి, తాసిల్దార్ దత్తాద్రి. ఎండిఓ శంకర్. గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజు గౌడ్. ఎంఈఓ శివలింగాలప్ప. వ్యవసాయ శాఖ అధికారి సిద్ధి రామేశ్వర్. జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు రవికుమార్. పలు గ్రామాల నుండి వచ్చిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.