అనారోగ్య వ్యక్తి కుటుంబానికి మానవత సహాయం
ఎడపల్లి, నవంబర్ 09 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన రేంజర్ల పోశెట్టి కుటుంబం తీవ్ర అనారోగ్యంతో జీవన పోరాటం చేస్తున్నారు ఆర్థిక ఇబ్బందులతో చికిత్స ఖర్చులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోశెట్టి కుటుంబానికి గ్రామ మాజీ సర్పంచ్ మద్ది సాయిలు కుమారులు మద్ది అశోక్ సహోదరులు మానవత దృక్పథంతో ముందుకు వచ్చి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా వారితోపాటు గ్రామ పెద్దలు పాల్గొని కుటుంబాన్ని పరామర్శించి ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబానికి మెరుగైన వైద్యం అందెందుకు అందరూ కలిసికట్టుగా సహాయం చేయాలని పిలుపునిచ్చారు ఈ బాధిత కుటుంబానికి సహాయం అందించాలని అనుకునే దాతలు జలగిరి సంజీవ్ 90595 95825 ఫోన్ నెంబర్ కు సంప్రదించవచ్చు అని తెలిపారు.