స్వాదర్ గృహాన్ని పరిశీలించిన బోధన్ సబ్ కలెక్టర్

ఎడపల్లి, నవంబర్ 18 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని స్వాధర్ గృహాలను మంగళవారం రోజున బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా తో జిల్లా సంక్షేమ అధికారి సిడిపిఓ బృందంతో కలిసి సందర్శించారు కేంద్రం యొక్క మొత్తం నిర్వహణ సేవలు లబ్ధిదారుల పునరావాస ప్రక్రియలను సమీక్షించారు ఈ సందర్శన సందర్భంగా అధికారులు లబ్ధిదారుల రికార్డులు కొనసాగుతున్న పునరావాస కేసులను పరిశీలించి నివాసితుల వసతి పరిస్థితులు పరిశుభ్రత భద్రత ఏర్పాట్లు వంటి అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు అదేవిధంగా కౌన్సెలింగ్ సేవలు వృత్తి శిక్షణ ఆరోగ్య పోషకాల సహాయం పై సమగ్రంగా పరిశీలించారు. అధికారులు లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు అవసరాలను తెలుసుకున్నారు. తక్షణ మెరుగుదలకు అవసరమైన సూచనలు జారీ చేసి డాక్యుమెంటేషన్ ఫాలో అప్ లైన్ డిపార్ట్ మెంట్ లతో సమన్వయం మరింత బలోపేతం చెయ్యాలని ఆదేశించారు.