సోమవారం దుర్గాదేవి ప్రతిష్టాపన మహోత్సవము
ఎడపల్లి, సెప్టెంబర్ 21 ( లోకంతీరు ) : స్వస్యశ్రీ. విశ్వనామా సం,,ర అశ్వయుజ శు,: పాడ్యమి 22-09-2025 సోమవారం రోజున ఉదయం 10 గంటల ఏడు నిమిషాలకు శ్రీ దుర్గా దేవి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం కలదు కావున సార్వజనిక్ దుర్గాదేవి ఉత్సవ కమిటీ బోధన్ పట్టణ ప్రముఖులు పెద్దలు యువకులు హిందూ బంధువులందరూ శ్రీ చక్రేశ్వర శివ మందిరం వద్దకు రావాలని కమిటీ సభ్యులు తెలిపారు ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేవి శరన్న వ రాత్రులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు తొమ్మిది రోజులపాటు కుంకుమార్చనలు హోమాలు సామూహిక రుద్రాభిషేకాలు దీపోత్సవాలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు రోజుకోఅవతారంలో దుర్గమ్మ తల్లి భక్తులకు 9 అవతారాల్లో దర్శనం ఇస్తారని వేద పండితులు తెలిపారు