చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై అదనపు కమిషనర్ కి వినతి

నిజామాబాద్, డిసెంబర్ 02 ( లోకంతీరు ) : చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ మరియు మైనారిటీ విభాగం అధ్యక్షుడు అజరుద్దీన్ ఈ రోజు అదనపు కమిషనర్ ని కలిసి, 42వ వార్డులోని చంద్రశేఖర్ కాలనీలో నెలకొన్న తీవ్రమైన పౌర సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది.చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం మరియు రోడ్లు అత్యంత అధ్వాన్నంగా మారడం వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సందర్భంగా అదనపు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో మురుగునీరు రోడ్లపైకి చేరుకుని, దుర్వాసనతో పాటు దోమలు, అంటువ్యాధులు పెరిగేందుకు కారణం అవుతోందని AAP నాయకులు వివరించారు. అదేవిదంగా రోడ్లు పూర్తిగా గుంతలమయమై, వర్షాకాలంలో మరింతగా పాడైపోతున్నాయని, దీనివల్ల ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యలను తక్షణమే గుర్తించి, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో త్వరగా కొత్త డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని మరియు పాడైన రోడ్లను పునరుద్ధరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.స్థానిక ప్రజల పక్షాన ఈ సమస్యల పరిష్కారానికి తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, తదుపరి చర్యల కోసం సిద్ధంగా ఉన్నామని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ అన్నారు.