అంబంలో డయాబెటిక్ శిబిరం
ఎడపల్లి , అక్టోబర్ 24 ( లోకంతీరు ) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అద్వర్యం లో బొధన్ లయన్స్ కంటి హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలోఎడపల్లి మండలం లోని అంబo గ్రామం లో డయాబెటిక్ క్యాంప్ ఉచిత మొబైల్ కంటి స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమం లో వైద్యులుఅజయ్ సుమారు 80మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 30మందికి మోతె బిందు ఉన్నట్లు నిర్ధారించారువారిని ఉచిత కంటిశస్త్ర చికిత్స నిమిత్తం బోధన్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగిందిఇ కార్యక్రమo లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షురాలు పుష్పలత సెక్రటరీ మెర్సీ కోశాధికారి శంకర్ జి ఈ టి కో-ఆర్డినేటర్ సూర్యనారాయణగంగారెడ్డి కాశీనాథ్ ప్రకాష్ మనోజ్ పి ఆర్ ఓ రాకేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.