ఉప సర్పంచ్ వార్డు సభ్యుల కు ఘనంగా సన్మానం

ఎడపల్లి , డిసెంబర్ 15 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడిన ఉప సర్పంచ్ వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు జయవర్ధన్ గౌడ్ ఘనంగా సన్మానించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సర్పంచ్ ప్యానల్ లో గెలుపొంది ఉపసర్పంచ్ ఆయన నీలం కృష్ణకు వార్డ్సభ్యులకుశుభాకాంక్షలు తెలిపారు. తనకు సర్పంచ్ ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.నూతనంగా ఎన్నుకోబడిన పాలక వర్గం గ్రామ అభివృద్ధి దిశగా నడపాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధిలో తమ వంతు సహాయ ,సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సందర్భంగా ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలుక రవికుమార్, బొక్కెన శ్రీనివాస్, గ్రామ యువకులు పెరిక రవికుమార్, శాల పోతన్న , మిద్దె సంపత్, షేక్ హైమద్,అబ్దుల్ హమీద్, వహీద్,సయ్యద్ నహీం, షేక్ నజీర్ ,షేక్ అఖిల్,షేక్ షేకిల్, వహీద్, గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.